
27 అడుగుల పొడవు... అతిపెద్ద మొసలి... మనిషిని అమాంతం మింగగలదు... అదేంటో? దాని విశేషాలేంటో తెలుసుకోండి!
లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికాలోని ఓ ప్రాంతంలో ఒక మంచి నీటి చెరువు ఉండేది. చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ ఆ నీటినే తాగి బతికేవారు. నీటి కోసం చెరువు దగ్గరికి వెళ్లిన వారిలో, సగం మంది వెనక్కి వచ్చే వారు కాదు. మరి ఏమయ్యే వారు? ఆ చెరువులో ఉన్న పెద్ద పెద్ద మొసళ్లకు ఆహారమైపోయేవారు. ఇలా ఒక్క ఈ చెరువు దగ్గరే కాదు, చుట్టుపక్కల ఉన్న సరస్సులన్నింటి దగ్గరా ఇదే పరిస్థితి. అలా మన పూర్వీకులని పొట్టన బెట్టుకున్న మొసలి సంగతుల్ని ఇప్పుడు మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ మొసళ్లు సుమారు 27 అడుగుల పొడవుండేవట. ఆఫ్రికా ఖండంలో తిరిగిన అన్ని మొసళ్లలో ఇవే పెద్దవి. సుమారు 20 లక్షల నుంచి 40 లక్షల ఏళ్ల మధ్య కాలంలో బతికేవి.
లక్షల ఏళ్ల క్రితం బతికిన మొసళ్ల గురించి ఇప్పుడు మనకెలా తెలిసింది? శిలాజాల వల్ల. కెన్యాలోని ఓ ఎండిపోయిన చెరువులో దీని శిలాజాలు దొరికాయి. వాటిలో ఓ పెద్ద తల కూడా ఉంది. ఇది ఎప్పుడో యాభై ఏళ్ల క్రితమే దొరికినా ఒక మ్యూజియంలో పెట్టి ఊరుకున్నారు. అయితే ఈ మధ్య కొంతమంది శాస్త్రవేత్తలు మ్యూజియానికి వెళ్లనప్పుడు దీన్ని చూసి పరిశోధన చేసేసరికి మహామొసళ్ల ఆనవాళ్లు చిక్కాయి. మ్యూజియంలో ఉంచిన మొసలి తలను మోయడానికి నలుగురు మనుషులు కావల్సి వచ్చింది.
లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికాలోని ఓ ప్రాంతంలో ఒక మంచి నీటి చెరువు ఉండేది. చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ ఆ నీటినే తాగి బతికేవారు. నీటి కోసం చెరువు దగ్గరికి వెళ్లిన వారిలో, సగం మంది వెనక్కి వచ్చే వారు కాదు. మరి ఏమయ్యే వారు? ఆ చెరువులో ఉన్న పెద్ద పెద్ద మొసళ్లకు ఆహారమైపోయేవారు. ఇలా ఒక్క ఈ చెరువు దగ్గరే కాదు, చుట్టుపక్కల ఉన్న సరస్సులన్నింటి దగ్గరా ఇదే పరిస్థితి. అలా మన పూర్వీకులని పొట్టన బెట్టుకున్న మొసలి సంగతుల్ని ఇప్పుడు మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ మొసళ్లు సుమారు 27 అడుగుల పొడవుండేవట. ఆఫ్రికా ఖండంలో తిరిగిన అన్ని మొసళ్లలో ఇవే పెద్దవి. సుమారు 20 లక్షల నుంచి 40 లక్షల ఏళ్ల మధ్య కాలంలో బతికేవి.
లక్షల ఏళ్ల క్రితం బతికిన మొసళ్ల గురించి ఇప్పుడు మనకెలా తెలిసింది? శిలాజాల వల్ల. కెన్యాలోని ఓ ఎండిపోయిన చెరువులో దీని శిలాజాలు దొరికాయి. వాటిలో ఓ పెద్ద తల కూడా ఉంది. ఇది ఎప్పుడో యాభై ఏళ్ల క్రితమే దొరికినా ఒక మ్యూజియంలో పెట్టి ఊరుకున్నారు. అయితే ఈ మధ్య కొంతమంది శాస్త్రవేత్తలు మ్యూజియానికి వెళ్లనప్పుడు దీన్ని చూసి పరిశోధన చేసేసరికి మహామొసళ్ల ఆనవాళ్లు చిక్కాయి. మ్యూజియంలో ఉంచిన మొసలి తలను మోయడానికి నలుగురు మనుషులు కావల్సి వచ్చింది.

అప్పట్లో మనుషుల్ని ఇవి అమాంతం మింగేయగలిగేంత పెద్దగా ఉండేవని చెబుతున్నారు. అలా మింగేసిన తరువాత రాళ్లు కూడా మింగేవి. ఎందుకో తెలుసా? దాని కడుపులో ఆ రాళ్లు గిరగిరా తిరగడం వల్ల మింగిన జంతువు మొత్తం రుబ్బురోట్లో పడినట్టు ఎముకలతో సహా నుజునుజ్జయిపోయి అరిగిపోయేది.

No comments:
Post a Comment